పెరిగిన లిక్కర్ ధరల నేపధ్యంలో ఈ ఏడాది తెలంగాణ సర్కార్ కు భారీ ఆదాయం దక్కింది. మొత్తంగా రూ.34,117 కోట్ల లిక్కర్, బీర్లు అమ్మకాలు జరగ్గా వీటి ద్వారా రూ.29 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. రంగారెడ్డి జిల్లా రూ.7,830 కోట్లతో రాష్ట్రంలో అత్యధిక ఆదాయం తీసుకురాగా.. రెండో స్థానంలో హైదరాబాద్ (రూ.3,652 కోట్లు) ఉంది. మూడో స్థానలో నల్గొండ (రూ.3,447 కోట్లు) ఉంది.వరంగల్ అర్బన్లో రూ.3,395 కోట్లు, కరీంనగర్లో రూ.2,893 కోట్లు, మెదక్లో రూ.2,841 కోట్లు, మహబూబ్ నగర్లో రూ.2,415 కోట్లు, ఖమ్మంలో రూ.2,145 కోట్లు విలువజేసే సేల్స్ జరిగినట్లు ఎక్సెజ్ శాఖ తెలిపింది.