గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు.. బీహార్ లోని ఇద్దరు లిక్కర్ స్మగ్లర్లు తమ వెనుక వస్తున్న అంబులెన్స్ సైరన్ ను పోలీస్ వాహనం అనుకుని నదిలోకి దూకేశారు. ఈ ఘటనలో ఓ స్మగ్లర్ నీట మునిగి మరణించగా.. మరొకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరిద్దరూ ఉత్తర ప్రదేశ్లోని చందౌలి జిల్లా నుంచి బైక్ పై బీహార్ కు మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు మహంత్ భగీరథ గ్రామానికి రాగానే వీరి వెనుక వస్తున్న అంబులెన్స్ హారన్ కొట్టింది. అది పోలీస్ సైరన్ అనుకుని వారు పక్కనే నదిలోకి దూకి తప్పించుకోవాలనుకున్నారు.