నిన్న రాత్రి లక్నోపై సూపర్ సెంచరీతో విరుచుకుపడ్డ బెంగళూరు ప్లేయర్ రజిత్ పాటిదార్ ఈ క్రమంలో పలు ఐపిఎల్ రికార్డుల్ని బద్దలు కొట్టాడు. ఆర్సీబీ తరపున నాకౌట్ మ్యాచ్లలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ప్లేఆఫ్స్లో ఆర్సీబీ తరపున అత్యధిక స్కోరు (54 బాల్స్లో 112) సాధించిన అతడు ఈ క్రమంలో క్రిస్ గేల్ (89)ను అధిగమించాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపిఎల్ ప్లే ఆఫ్స్లో సెంచరీ చేసిన 4వ భారత ఆటగాడు రజిత్ పాటిదార్.