చండీగఢ్లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం సమీపంలో ఒక లైవ్ బాంబ్ షెల్ను గుర్తించినట్లు చండీగఢ్ పోలీసులు తెలిపారు. బాంబు స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో ఆ బాంబ్ షెల్ను సురక్షితంగా ఉంచామని, ఆ పరిసరాలను ఖాళీ చేయించామని చండీగఢ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ సంజీవ్ కోహ్లి వివరించారు. ఈ కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులు సైనిక బృందం సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.