రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్.. ఆ సమయంలో కారును అతి వేగంగా నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. గత శనివారం అతడు ఒంటరిగా ప్రయాణిస్తూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యక్ష సాక్షి వేలాన్ టౌన్సన్ మాట్లాడాడు. ‘నా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది. అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో సైమండ్స్ కారులోనే మరణించాడు. అతడిని కాపాడేందుకు సిపిఆర్ కూడా చేశా’ అని వెల్లడించాడు.