ఓ ప్యాసింజర్ ట్రైన్ డ్రైవర్ ట్రైన్ను 2 గంటలకు పైగా స్టేషన్లో ఆపేసి మందు కొట్టడానికి వెళ్ళిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. అక్కడి సమస్టిపూర్ జిల్లాలోని హసన్పూర్ రైల్వే స్టేషన్లో 2 నిమిషాల హాల్ట్ కోసం ట్రైన్ను ఆపిన లోకో పైలట్.. ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఆ రాష్ట్రంలో నిషేధించిన మద్యాన్ని సేవించి తిరిగొచ్చాడు. దీంతో దాదాపు గంట సేపు ఆ ట్రైన్ హసన్పూర్ స్టేషన్లోనే సోమవారం సాయంత్రం 4.05 నుంచి 5.45 వరకూ ఆగిపోయింది.