దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రతీనెలా ఒకటో తేదీన ఈ సిలిండర్ల ధరలు సవరిస్తున్న కంపెనీలు నిన్న ఆదివారం నాడు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలపై రూ.102.50 పెంచింది. దీంతో గతంలో రూ.2,253 ఉన్న ఒక సిలిండర్.. ప్రస్తుతంరూ.2,355.50కు చేరింది. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.655గా పేర్కొంది. గత నెల ఏప్రిల్ 1న 19 కేజీల సిలిండర్పై రూ.250 ధర పెరిగిన విషయం తెలిసిందే.