ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై 50 సార్లు అత్యాచారం చేసిన కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన కానిస్టేబుల్ సునీల్ కుమార్ సింగ్ కు ప్రయాగ్ రాజ్ లో డ్యూటీ సమయంలో ఓ మహిళతో పరిచయం అయింది. ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్న అతడు పెళ్ళాడతంటూ శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. ఆపై ఆమె పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా వాయిదా వేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.