ఐపిఎల్లో కోల్కతా (12 పాయింట్స్) కథ ముగిసింది. రాత్రి లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చివరి వరకూ అద్భుతంగా ఆడిన ఆ జట్టు చివరి ఓవర్లో తడబడి ఓటమి పాలై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు డికాక్ 140, రాహుల్ 61 చేయడంతో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేధనలో నితీష్ రాణా 42, అయ్యర్ 50, బిల్లింగ్ 36, రింకూ సింగ్ 40, నరైన్ 21 పరుగులు చేసినా 208 పరుగులతో సరిపెట్టుకుంది.