మధ్యప్రదేశ్ విద్యశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ కోడలు సవిత పర్మర్ ఆత్మహత్యకు పాల్పడడం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. 22 ఏళ్ళ సవిత.. ఇందర్ సింగ్ కుమారుడు దేవ్రాజ్ పర్మర్కు భార్య. అయితే భార్య ఆత్మహత్యకు గురైన సమయంలో అతడు ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఆత్మహత్యపై అక్కడి ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి.