రూ.5.93 కోట్ల విద్యుత్​ చోరీ చేసిన తండ్రీ కొడుకులు

By udayam on May 17th / 9:04 am IST

మహారాష్ట్రకు చెందిన తండ్రీ కొడుకులు ఏకంగా రూ.5.93 కోట్ల విలువైన విద్యుత్​ను చోరీ చేశారు. పవర్​ సప్లైలో వస్తున్న భారీ లోటును గుర్తించిన విద్యుత్​ ఉద్యోగులు.. థానే జిల్లాలోని ముర్​బాద్​ ప్రాంతంలో స్టోన్​ క్రషింగ్​ యూనిట్​పై దాడి చేయడంతో ఈ విషయం బయటపడింది. రిమోట్​ గాడ్జెట్ల సాయంతో మీటర్​ రీడింగ్​లను టాంపరింగ్​ చేస్తున్నట్లు తెలిపారు. గత 29 నెలలుగా రూ.5.93 కోట్ల విలువైన 34,09,901 యూనిట్లను వీరిద్దరూ కాజేశారని విద్యుత్​ శాఖ వీరిపై కేసు నమోదు చేశాయి.

ట్యాగ్స్​