మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతడిని ఈరోజు ఉదయం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరం, డయేరియాతో ఆయన బాధపడుతున్నట్లు ఆయన తరపున లాయర్ కోర్టుకు వెల్లడించారు. గత వారం ఆయనను ఎంపి, ఎమ్మెల్యేల కేసులను పర్యవేక్షించే స్పెషల్ కోర్ట్ ఆదేశాల మేరకు ఆర్థుర్ రోడ్ జైలుకు తరలించిన పోలీసులు రిమాండ్ను కొనసాగిస్తున్నారు.