విడుదలైన రోజు నుంచే మిశ్రమ స్పందన దక్కించుకున్న మహేష్ బాబు, పరశురామ్ పెట్ల మూవీ ‘సర్కారు వారి పాట’ వారం రోజుల్లో రూ.175 కోట్లు వసూళ్ళు సాధించింది. ఇప్పటికే టాలీవుడ్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, తమిళ నటుడు సముద్ర ఖని, సుబ్బరాజులు నటించారు. ఈ వారాంతం నుంచి ఈ మూవీలో ‘మురారి బావ’ అనే కొత్త మాస్ సాంగ్ను సైతం యాడ్ చేస్తుండడంతో మరిన్ని కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.