ఇటీవల మరణించిన తన తండ్రి, టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను ఆయన కొడుకు మహేష్ బాబు విజయవాడలోని పవిత్ర కృష్ణా నదిలో కలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆయన వెంట ఉండగా.. కరకట్ట, తులసీ వనం వద్ద కృష్ణా నదిలో అస్థికలను నిమజ్జనం చేశారు. ఈనెల 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యంలతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు 350 కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు సినీ జీవితాన్ని గడిపారు.
ఇటీవలే కన్నుమూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను విజయవాడ లోని కృష్ణా నదిలో కలిపిన ఆయన కొడుకు మహేష్ బాబు.. మహేష్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.#MaheshBabu #Vijayawada #SuperStarKrishna pic.twitter.com/dXYLgH1ZGX
— Udayam News Telugu (@udayam_official) November 21, 2022