మహేష్బాబు తొలి పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్పైకి వెళ్తుందని ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్ స్థాయి టేకింగ్తో, భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని తెలిపారు. ‘కథ, స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదు, అడవి బ్యాక్డ్రాప్తో ఈ మూవీ ఉంటుంది. మహేష్ త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నారు. అది అయ్యాక మా సినిమా ఉంటుంది’ అని వెల్లడించారు.