150 మంది బాలికల్ని కాపాడిన ఆర్పీఎఫ్​

By udayam on June 2nd / 11:39 am IST

దేశవ్యాప్తంగా రైళ్ళ ద్వారా జరుగుతున్న మహిళల అక్రమ రవాణా నుంచి 150 మంది బాలికలతో పాటు ఒక మహిళను సైతం కాపాడినట్లు రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ వెల్లడించింది. మే 3 నుంచి మే 31 వరకూ మహిళా సురక్ష పేరుతో ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న దాదాపు 7 వేల మందిని అరెస్ట్​ చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం 223 స్టేషన్లలో 283 టీమ్​లు నిర్విరామంగా కృషి చేసినట్లు తెలిపింది. 2.25 లక్షల మహిళలను ప్రశ్నించి వారిలో 150 మంది బాధితులను కాపాడామని పేర్కొంది.

ట్యాగ్స్​