దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. ముండ్కా రైల్వే స్టేషన్ దగ్గరల్లోని ఈ వాణిజ్య భవనంలో ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇప్పటి వరకూ భవనం నుంచి 27 మంది మృతదేహాలను వెలికి తీశామని డిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు. ఈ ప్రమాదంలో 2వ అంతస్తులో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది. మరో 50 మందిని సురక్షితంగా కాపాడారు.