రెండు తెలుగు రాష్ట్రాలకూ హైదరాబాద్నే మరో 30 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఎపి యువతకు వచ్చే 50 ఏళ్ళలోనూ రాజధానిని చూసే కల నెరవేరేలా లేదన్న ఈ కమిటీ.. 2024 తర్వాత కూడా మరో 30 ఏళ్ళ పాటు హైదరాబాద్నే రాజధానిగా కొనసాగించాలని వారు విజయవాడలో ప్రదర్శన చేశారు. సిఎం జగన్ కేవలం ఒకే చోట రాజధానిని నిర్మించే ఆలోచన చేస్తేనే ఎప్పటికైనా ఎపికి రాజధాని కల నెరవేరుతుందని పేర్కొన్నారు.