మలయాళం డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ను ఈరోజు కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. నటి మంజు వారియర్.. సనల్ తనను మానసికంగా హింసిస్తున్నాడంటూ చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. అంతకు ముందు జరిగిన హైడ్రామాలో సనల్ కుమార్.. తనను కొందరు కిడ్నాప్ చేయడానికి వచ్చారని, ఈ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని చెబుతూ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడాడు. దీంతో కొచ్చి పోలీసులు అతడి అడ్రెస్ను ట్రేస్ చేసి పరస్సాల గ్రామానికి చేరుకుని అరెస్ట్ చేశారు.