మల్లారెడ్డి : నా హత్యకు రేవంత్​ కుట్ర

By udayam on May 30th / 7:35 am IST

రెడ్ల సింహగర్జన సభలో తనపై దాడి, హత్యకు టిపిసిసి ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి కుట్ర పన్నారని తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనపై దాడికి పాల్పడ్డ వారిని వదిలేది లేదని వారిపై పోలీసు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రేవంత్​ రెడ్డి గతంలో చేసిన నేరాలపై విచారణ జరిపి ఆయనను తప్పకుండా జైలుకు పంపిస్తానని ఆయన శపథం చేశారు. నిన్న రాత్రి జరిగిన రెడ్ల సింహగర్జనలో మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న నిరసనకారులు అనంతరం ఆయన కాన్వాయ్​పై దాడికి దిగారు.

ట్యాగ్స్​