దేశవ్యాప్తంగా 100 మంది మహిళలను ప్రేమ పేరుతో మోసగించి వారిని పెళ్ళాడతానని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఘనుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోంఝర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ళ ఫర్హాన్ తసీర్ ఖాన్పై ఎయిమ్స్ లో పనిచేస్తున్న మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్రిమోనియల్ సైట్లలో పెట్టే మహిళల అకౌంట్ల నుంచి వారి వివరాలు తెలుసుకుని అతడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.