చనిపోకుండానే వ్యక్తిని శవాల బ్యాగ్​లోకి కుక్కిన సిబ్బంది

By udayam on May 3rd / 8:10 am IST

డాక్టర్లు చనిపోయారని చెప్పడంతో శవాల బ్యాగ్​లోకి ఎక్కించిన ఓ వ్యక్తి తిరిగి బతికిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైలో ఒక కరోనా పేషెంట్​ చనిపోయాడని భావించి మృత దేహాలను తరలించే వ్యానులోకి ఎక్కించారు. అయితే వ్యాన్​లోకి ఎక్కిస్తున్న క్రమంలో బ్యాగ్​ ఓపెన్​ చేసి చూడగా అందులోని వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని గుర్తించారు. దీంతో ఈ వీడియో వైరల్​ అవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. నలుగురు అధికారులను సస్పెండ్​ చేశారు.

ట్యాగ్స్​