గోవా రిసార్ట్లో ఓ విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ వద్ద అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అరంబోల్ రిసార్ట్లో రూమ్ అటెండెంట్గా ఉన్న 28 ఏళ్ళ రవి లమని ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్ పూల్, హోటల్ గదిలో 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి పెర్నెమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని కర్ణాటకలో పట్టుకున్నారు.