చైనా నుంచి బెంగళూరు వచ్చిన వ్యక్తికి కొవిడ్​

By udayam on December 26th / 9:32 am IST

చైనా నుంచి ఆదివారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ 35 ఏళ్ళ భారతీయ వ్యక్తికి కొవిడ్​ పాజిటివ్​ గా తేలింది. దీంతో అతడిని ఈరోజు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి శాంపిల్​ ను జీనోమిక్​ సీక్వెన్సింగ్​ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం కూడా చైనా నుంచి ఆగ్రా వచ్చిన 40 ఏళ్ళ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్​ గా తేలిన సంగతి తెలిసిందే. కరోనా పుట్టినిల్లు చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న కొవిడ్​ వేరియంట్​ బిఎఫ్​.7 అత్యంత ప్రమాదకారిగా భారత ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్​