ప్రపంచవ్యాప్తంగా మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో ఒకటైన చికెన్ టిక్కా మసాలా సృష్టికర్త మిస్టర్ అలీ సోమవారం మరణించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. పాకిస్థాన్ కు చెందిన అహ్మద్ అస్లాం (ఇతడినే మిస్టర్ అలీగా పిలుస్తారు) స్కాట్లాండ్ లో సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో 1964లో గ్లాస్గో లో షిష్ మహల్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసి ఈ కొత్త రకం వంటకాన్ని తయారు చేసేవాడు. ఇది కాస్తా అతడిని ప్రపంచప్రఖ్యాత చెఫ్ గా మార్చి పేరు ప్రఖ్యాతల్ని తీసుకొచ్చింది.