తనను లక్నో జట్టు నుంచి తప్పిస్తున్నట్లు మాటమాత్రమైనా చెప్పలేదని బ్యాటర్ మనీష్ పాండే ఆరోపించాడు. డిసెంబర్ 23న జరగనున్న మినీ వేలం కోసం ఐపిఎల్ జట్లు తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్ ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లక్నో జట్టు మనీష్ ను వేలానికి వదిలిపెట్టేసింది. దీనిపై అతడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాను జట్టులో లేనన్న విషయం తనకు జాబితా చూస్తే కానీ తెలియలేదన్నాడు. ఈ విషయం తనతో ఏ ఒక్కరూ చెప్పలేదుని.. ఎలాంటి సమాచారం లేకుండానే ఇలా తనను బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.