ఉక్రెయిన్లోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతం మేరియుపోల్ను రష్యా సేనలు హస్తగతం చేసుకున్నాయి. ఇక్కడి శత్రు దుర్భేధ్యమైన స్టీల్ ప్లాంట్లో ఉంటూ పుతిన్ సేనలను ప్రతిఘటించిన ఉక్రెయిన్ సైనికుల్లో 260 మంది నిన్న రష్యాకు లొంగిపోయారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం రష్యా చేతికి చిక్కినట్లయింది. లొంగిపోయిన వారిలో అమెరికా నావికాదళానికి చెందిన అడ్మిరల్ ఇరిక్ ఒల్సన్, బ్రిటన్ విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్, నాటో సైనిక శిక్షకులు 4 గురు సైతం ఉన్నారు.