కేంద్రం: మాస్క్​ లు పెట్టుకోండి.. బూస్టర్​ డోస్​ తీసుకోండి

By udayam on December 22nd / 5:27 am IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం దేశ ప్రజలకు మరోసారి కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. దేశంలో కొవిడ్​ 4వ వేవ్​ రావొచ్చన్న సంకేతాల నేపధ్యంలో ప్రజలు జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మాస్క్​ ను తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. దీంతో పాటు ఇప్పటికే 2 డోసుల కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్న వారు బూస్టర్​ డోస్​ తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దని పేర్కొంది. చైనాలో కొవిడ్​ వ్యాప్తికి కారణమైన బీఎఫ్-7 వేరియంట్​ తో మన దేశంలోనూ 3 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​