క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సంబరాల కారణంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో భారీ గా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మంజు క టిలా, గాంధీ నగర్ రెడ్ లైట్, శాస్త్రి పార్క్, జియా సరై, మునిర్కా, ఎన్.హెచ్–48, గురుగ్రామ్ బోర్డర్ ల వద్ద తీవ్రంగా ట్రాఫిక్ ఆగిపోయినట్లు ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా రాసుకొస్తున్నారు. వీటితో పాటు పశ్చిమ్ విహార్, షాలిమార్ బాగ్, ద్వారకా మోర్, జిటికె బస్ డిపో, మంజు క టిలా, సుల్తాన్ పురి బస్ టెర్మినల్ కూడా వాహనాదారులతో నిండిపోయింది.