శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ 2వ రోజు ఆటలో భాగంగా అతడు తన అద్భుతమైన బ్యాటింగ్తో శ్రీలంకను ఆదుకున్నాడు. ఈ క్రమంలో 397 బాల్స్ ఆడి 199 రన్స్ కొట్టి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. నయీమ్ బౌలింగ్లో అనవసర షాట్ ఆడి ఇలా ఔటయ్యాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో 199 పరుగులు వద్ద ఔటైన 12వ ఆటగాడిగా మాథ్యూస్ నిలిచాడు.