పోంజీ స్కీమ్​ల పేరుతో రూ.100 కోట్లు హాంఫట్​

By udayam on June 3rd / 5:58 am IST

దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పోంజీ స్కీమ్​ల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.100 కోట్లను కొల్లగొట్టిన ఆషిష్​ మాలిక్​ను ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ అరెస్ట్​ చేసింది. దేశవ్యాప్తంగా సెమినార్లను నిర్వహిస్తూ బాధితులకు 20 శాతం లాభాలను ఆశజూపి వారితో భారీగా పెట్టుబడులు పెట్టించాడని, ఆపై వాటితో సహా ఉడాయించేవాడని ఈఓడబ్ల్యూ అధికారులు తేల్చారు. రష్యాలోని ఓ ఆయిల్​ కంపెనీలో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు అతడు వారిని నమ్మించేవాడని తెలిపారు.

ట్యాగ్స్​