ఎవర్ గ్రీన్ కార్ప్స్ మెరైన్ సంస్థ.. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. 2021 ఏడాదిలో సూయజ్ కాలువను దాదాపు 10 రోజుల పాటు ఆపేసిన భారీ నౌకకు చెందిన ఈ తైవాన్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. తన కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో పాటు పలువురు సీనియర్ మేనేజర్లకు ఒకేసారి 50 నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించి ప్రపంచ వ్యాపార వర్గాలను ఆశ్చర్యంలో పడేసింది. వస్తు రవాణా రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఈ కంపెనీ నిర్ణయంతో ఆ సంస్థ ఉద్యోగుల ఆనందానికి హద్దుల్లేవు.