ఈనెల 23న జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారమే సిఎం జగన్ చేతుల మీదుగా బీఫారం అందుకున్న విక్రమ్ ఈరోజు నామినేషన్ను సమర్పించారు. విక్రమ్ వెంట మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఈనెల 26న విడుదల కానున్నాయి.