భూగోళం ప్రతీ ఇంచునూ కమ్మేస్తున్న ప్లాస్టిక్ భూతం అత్యంత సుందరమైన అంటార్కిటిక్ మంచు ఖండాన్ని సైతం ఆవహిస్తోంది. అక్కడ కురిసిన మంచులో భారీ స్థాయిలో మైక్రో ప్లాస్టిక్ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడి ప్రతీ లీటరు నీటిలో సగటున 28 ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఈ ఖండంలో మంచు వేగంగా కరిగిపోయే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇలా ఈ ఖండంలోని మంచులో ప్లాస్టిక్ రేణువులు బయటపడడమూ ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.