వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే

By udayam on May 17th / 12:30 pm IST

ఆంధ్రప్రదేశ్​లో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్​ చేసింది. వైకాపా ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్యకు, న్యాయవాది నిరంజన్​ రెడ్డికి, బీద మస్తాన్​ రావు పేర్లను ఖరారు చేశారు. కిల్లి కృపారాణి పేరునూ ఫైనల్​ చేస్తారని భావించినా చివరి దఫా చర్చల్లో ఆమెకు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని మంత్రి బొత్స ప్రకటించారు.

ట్యాగ్స్​