‘రాష్ట్ర ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం కదా!! ఇంకా మీ అన్ని అవసరాలు తీర్చాలంటా ఎలా కుదురుద్ది? అభివృద్ధి జరగాలంటే సమయం పడుతుంది’ ఇదేదో సామాన్య ప్రజలు పిచ్చా పాటీగా మాట్లాడుకున్న వ్యాఖ్యలు కాదు.. ఏకంగా ఎపి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పిన మాటలు. మంత్రుల బస్ టూర్ ముగింపు సందర్భంగా అనంతపురంలో జరిగిన సమావేశంలో మంత్రివర్యులు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీశాయి.