వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎమ్మెల్సీనే ఈ హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా మార్చే ప్రయత్నం చేశారని కాకినాడ ఎస్పీ వెల్లడించారు. మద్యం సేవించి ఉన్న సుబ్రహ్మణ్యంను కొట్టడంతో డ్రైనేజీ గట్టుమీద పడ్డంతో తలకు తీవ్ర గాయమైందని, ఆపై వెక్కిళ్ళు రాగా అనంత బాబు మంచినీళ్ళు తెచ్చేలోపే అతడికి శ్వాస ఆగిపోయిందని తెలిపారు. దీంతో ఈ హత్యను యాక్సిడెంట్గా మార్చేందుకు అనంతబాబు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.