దేశీయ కార్ల కంపెనీ మహీంద్ర తన ఎక్స్యూవీ 300 సిరీస్లో ఫుల్లీ ఎలక్ట్రిక్ వర్షన్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ–కార్ను తీసుకొస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్లో విద్యుత్తు వాహన ప్రణాళికను సైతం ప్రకటిస్తామని మహీంద్ర పేర్కొంది. ఫోక్స్వ్యాగన్ కంపెనీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇటీవలే మహీంద్ర చేతులు కలిపిన విషయం తెలిసిందే.