దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీనియర్ బిజెపి నాయకులు 300ల మంది వరకూ హైదరాబాద్లో మకాం వేయనున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 2, 3 తేదీల్లో వీరంతా నగరంలోనే ఉండనున్నారని సమాచారం. నోవోటెల్తో పాటు హెచ్ఐసీసీ, తాజ్ కృష్ణ హోటళ్ళలో ఏదో ఒకదానిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల సిఎంలతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు సైతం ప్రధానితో పాటే ఆ రెండు రోజులూ హైదరాబాద్లోనే ఉండి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.