చాలా వరకూ ఐపీఎస్, ఐఎఎస్ అధికారులు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకు తొత్తులుగా ఉంటున్నారని సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుపతిలోని ఆయన కాలేజీలో జరిగిన విశాల్ మూవీ ‘లాఠీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మోహన్ బాబు మాట్లాడుతూ ‘సార్ ఇది నిజం.. ఇదీ జరిగింది.. నేను కళ్ళారా చూశాను. కానీ మీరు తప్పు చెప్పమంటున్నారు. నేను నిజం చూశాను అంటే అతడి ఉద్యోగం ఊడినట్లే’ అన్నారు. పై స్థాయి అధికారుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని చెప్పారు. ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెపుతానని అన్నారు.
Mohan Babu Controversial Comments On IAS & IPS System | Mohan Babu Speech At Lathi Pre-release Event
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మోహన్ బాబు..పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటున్నారంటూ వ్యాఖ్య… pic.twitter.com/ZW43NXPMBW
— ETVTelangana (@etvtelangana) December 20, 2022