ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్.ధోనీ తన పేరిట మరో రికార్డ్ను నెలకొల్పాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తూ 2500 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 బాల్స్లోనే 21 పరుగులు చేసిన అతడు మ్యాచ్కు తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ ఐపిఎల్లో చేసినవి తక్కువ పరుగులే అయినా ఫినిషర్గా చివరి ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.