రైళ్ళలో చిన్నారులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తల్లీ పిలలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీఉలగా బేబీ బెర్త్లను సైతం మెయిన్ బెయిడ్కు అటాచ్ చేసింది. ఉత్తర రైల్వే డివిజన్లోని లక్నో, ఢిల్లీ ట్రైన్లలో ఈ సదుపాయాన్ని ముందుగా ప్రవేశపెట్టింది. దీనిపై లక్నో డిఆర్ఎం ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. ఫోల్డ్ అయ్యేలా ఉండే ఈ బేబీ బెర్త్లతో తల్లులకు మరింత సౌలభ్యమైన ట్రైన్ జర్నీ దక్కుతుందని పేర్కొంది.