మిస్టర్ కంసిస్టెంట్ శిఖర్ ధావన్ ఐపిఎల్లో ప్రత్యేక రికార్డ్ను సొంతం చేసుకున్నాడు. ఈ పొట్టి ఫార్మాట్లో 700 ఫోర్స్ బాదిన తొలి క్రికెటర్గా నిలిచాడు. నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ధావన్ 32 బాల్స్లో 39 పరుగులు చేయగా అందులో 2 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో మొత్తంగా ధావన్ ఐపిఎల్ కెరీర్లో 701 ఫోర్లు చేరాయి. అతడి తర్వాత డేవిడ్ వార్నర్ 577 ఫోర్లతోనూ, విరాట్ కోహ్లీ 576 ఫోర్లతోనూ ఉన్నారు.