చెన్నై మళ్ళీ ఓడింది.. బెంగళూరుతో నిన్న జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు వెళ్ళే అవకాశాల్ని దాదాపుగా మూసేసుకుంది. అలా అని బెంగళూరు ఏదో 200కు పైగా పరుగులో.. ఆ జట్టులో బౌలర్లు 5కు పైగా వికెట్లో తీసేశారనుకుంటే పొరపాటే. లామ్రోర్ 42, డుప్లెసిస్ 38 చేయడంతో ఆ జట్టు తొలుత 173 పరుగులు చేసింది. ఆపై కాన్వే 56 తప్ప చెన్నైను ఆదుకున్న బ్యాటర్ ఒక్కడూ లేకపోవడంతో ఆ జట్టు 160 పరుగులకే సరిపెట్టుకుని ఓటమిని కొనితెచ్చుకుంది.