భారత దిగ్గజ వ్యాపార వేత్త, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఏకంగా 84.5 బిలియన్ డాలర్ల ఆస్తితో అతడు చైనా బిలియనీర్లైన జాక్మాను, జాంగ్ షన్షన్లను దాటేశారు. అంబానీతో పాటు మొత్తం 140 మంది బిలియనీర్లతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు కలిగిన 3వ దేశంగా అవతరించింది. అమెరికాలో 724, చైనాలో 698 బిలియనీర్లు ఉన్నారు.