ముకేష్ అంబానీ రిటైర్మెంట్ జీవితానికి మరింత దగ్గర కానున్నారు. మంగళవారం జియో బోర్డ్కు రాజీనామా ఇచ్చేసిన ఆయన తన కుమారుడు ఆకాష్ అంబానీని జియో సంస్థకు ఛైర్మన్గా నియమించారు. అయితే ఇదే సమయంలో ఆయన కూతురు ఈషా అంబానీని రిలయన్స్ రిటైల్ యూనిట్కు ఛైర్ పర్సన్గా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నియామకం పూర్తయిందని, అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. బుధవారమే ఈ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.