దేశంలో పాపులర్ బ్రాండ్లయిన 30 కంపెనీలను గంపగుత్తగా కొనేయడానికి రిలయెన్స్ సిద్ధమైంది. ఇందుకోసం 6.5 బిలియన్ డాలర్లను ఆ సంస్థ ఖర్చు చేయనుంది. జియో మార్ట్ శ్రేణి విస్తరణలో భాగంగా ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద కన్స్యూమర్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్కు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. వచ్చే 6 నెలల్లోనే రిలయెన్స్ తన రిటైల్ కంపెనీల బ్రాండ్లను 50 నుంచి 60 వరకూ పెంచుకోనున్నట్లు తెలుస్తోంది.