ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఓ అగ్నిప్రమాదం 27 మంది జీవితాల్ని బుగ్గిపాలు చేసింది. ఈ ప్రమాదానికి కారణమైన బిల్డింగ్కు కనీసం ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ కూడా లేదు. 4 అంతస్తుల ఈ వాణిజ్య బిల్డింగ్లో ఎలాంటి అనుమతులు లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్ నడుస్తోంది. ఒకే ఒక్క మెట్ల దారి మాత్రమే ఉండడంతో మంటలు వ్యాపించగానే ప్రజలు తప్పించుకోలేకపోయారు. చిన్న లిఫ్ట్ కూడా ఉన్నా అందులో ఇద్దరికి మించే పట్టే ప్రశక్తి లేదని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.