ఏపీలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతుంది. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు శేషగిరిరావుపై భవాని మాలలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శేషగిరి రావు చేతికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దాడి అనంతరం దుండగుడు బైక్ పై పారిపోయాడు. ఈ ఘటన మొత్తం సిసిటివి ల్లో రికార్డ్ అయింది. కత్తిని కనిపించకుండా దుండగుడు తన దగ్గర ఉన్న టవల్ తో కప్పి ఉంచాడు. ఎప్పుడైతే శేషగిరి రావుపై దాడి చేద్దామనుకున్నాడో ఆ సమయానికే సరిగ్గా కత్తి బయటకు తీసి దాడి చేశాడు.
In a scene looks like straight from a movie a man in Bhavani Deeksha dress while seeking alms takes out weapon & attacks @JaiTDP’s ex MPP Polinati Seshagiri Rao in Tuni of Kakinada dist. Grievously injured Rao has been shifted to a nearby hospital. pic.twitter.com/YvR3UZ9I6w
— Sachin (@Sachin54620442) November 17, 2022