టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి భానుమతి ఈ ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో ఆమె కన్నుమూశారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమెకు ఇంటి వద్దనే చికిత్స కొనసాగుతుండగా.. ఇటీవలే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు. దర్శకుడు రాజమౌళికి ఈమె పెద్దమ్మ అవుతారు. ఆమె పార్ధీవ దేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారు.